Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌కు మోదీ మరో షాక్... సింధు జలాలు పాకిస్తాన్‌కు వెళ్లనివ్వం... పాక్ గిలగిల...

పొద్దస్తమానం భారతదేశంలో ఏదో ఒక దుశ్చర్యకు పాల్పడేలా ప్రేరేపిత ఉగ్రవాదులను రెచ్చగొట్టే పాకిస్తాన్ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ షాక్ ఇచ్చారు. సింధు నది జలాలను పాకిస్తాన్‌కు వెళ్లనీయబోమన్నారు. ఆ నదిపైన భారతదేశానికి హక్కులు ఉన్నాయనీ, నదీ జలాలన

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (16:12 IST)
పొద్దస్తమానం భారతదేశంలో ఏదో ఒక దుశ్చర్యకు పాల్పడేలా ప్రేరేపిత ఉగ్రవాదులను రెచ్చగొట్టే పాకిస్తాన్ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ షాక్ ఇచ్చారు. సింధు నది జలాలను పాకిస్తాన్‌కు వెళ్లనీయబోమన్నారు. ఆ నదిపైన భారతదేశానికి హక్కులు ఉన్నాయనీ, నదీ జలాలను వాడుకునే హక్కు భారతదేశానికి పూర్తిగా ఉన్నదని ఆయన వెల్లడించారు. 
 
సింధు జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయనీ, వాటిని సక్రమంగా వాడుకుంటామని అన్నారు. శుక్రవారం నాడు ఆయన పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో ఎయిమ్స్ శంకుస్థాపన సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కాగా 1960లో ఇండస్ ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులు మన దేశానికి చెందగా ఇండస్(సింధు), జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్ దేశానికి దక్కాయి. 
 
కాగా భారతదేశం నుంచి పాకిస్తాన్ దేశంలో ప్రవహించే ఈ నదీ జలాలను భారత్ అడ్డుకట్టవేస్తే పాకిస్తాన్ దేశం మలమలమాడుతుంది. నీరు లేక అక్కడి భూములు బీడువారుతాయి. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలంటే ఇంతకుమించి మరో మార్గం లేదని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments