Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటితో ఎన్డీయే పాలనకు మూడేళ్లు.. గుర్తుగా దేశంలో అతిపెద్ద వంతెన ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చి శుక్రవారంతో మూడేళ్లు. దీనికి గుర్తుగా ప్రధాని మోడీ అతిపెద్ద వంతెనను ప్రారంభించారు. ఇది దేశంలోనే అతిపెద్ద తొలి వంతెన కావడం గమనార్హం

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (11:04 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చి శుక్రవారంతో మూడేళ్లు. దీనికి గుర్తుగా ప్రధాని మోడీ అతిపెద్ద వంతెనను ప్రారంభించారు. ఇది దేశంలోనే అతిపెద్ద తొలి వంతెన కావడం గమనార్హం. మొత్తం 9.15 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. అస్సాంలోని సాదియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ధోలా‌లను ఈ సేతువు కలుపుతుంది. 
 
ముంబైలోని బాంద్రా-వోర్లి సీ లింక్ బ్రిడ్జి కంటే ఇది 3.55 కిలోమీటర్ల పొడవైనది. సాదియా-ధోలా బ్రిడ్జి ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 6 గంటల ప్రయాణ దూరాన్ని కేవలం గంటకు తగ్గించనుంది. అలాగే 60 టన్నుల యుద్ధ ట్యాంకును కూడా దీనిపై నుంచి తరలించేంత దృఢంగా దీనిని నిర్మించారు.
 
ఇకపోతే.. చైనో-ఇండియా సరిహద్దుకు సమీపంలో ఉండటంతో యుద్ధ సమయంలో యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను సైన్యానికి వేగంగా చేరవేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్, అసోం ప్రజలు ఎయిర్‌పోర్టు, రైలు మార్గాలను వేగంగా చేరుకునే వెసులుబాటును ఈ బ్రిడ్జి కల్పిస్తోంది. 
 
వంతెన నిర్మాణం 2011లో ప్రారంభమైంది. ఈ వంతెన నిర్మాణం కోసం రూ.950 కోట్లను ఖర్చు చేశారు. అసోం రాజధాని దీస్ పూర్‌కు 540 కిలోమీటర్లు, అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపే ఉంది. దీంతో డ్రాగన్ కంటీ ఇటువైపు ఓ కన్నేసి ఉంచింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments