Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవేశంలో నిర్ణయం తీసుకోలేదు.. అమిత్ షా గారూ... త్వరలో లేఖ రాస్తాం: నారా లోకేష్

ఎన్డీయే నుంచి వైదొలగడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని తప్పుబట్టిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. రాజకీయ కారణాల నేపథ్యంలోనే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయిందంటూ

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (15:21 IST)
ఎన్డీయే నుంచి వైదొలగడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని తప్పుబట్టిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. రాజకీయ కారణాల నేపథ్యంలోనే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయిందంటూ లేఖలో చెప్పిన అమిత్ షా వ్యాఖ్యలను నారా లోకేష్ ఖండించారు. రాజకీయ లబ్ధితో ముందుకు వెళ్తున్నది టీడీపీ కాదని, బీజేపీనేనని చెప్పారు. 
 
రాజకీయ కారణాలతోనే ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు అందించట్లేదని ఫైర్ అయ్యారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లకు ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటని... యుటిలైజేషన్ సర్టిఫికెట్లకు 19 హామీలను నెరవేర్చకపోవడానికి సంబంధం ఏమిటని నారా లోకేష్ అడిగారు. ఏపీ సమస్యలపై అమిత్ షాకు అవగాహన కూడా లేదనే విషయం ఆయన రాసిన లేఖను బట్టే అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. 
 
అన్ని వివరాలను పొందుపరుస్తూ.. త్వరలోనే కేంద్రానికి ఏపీ సర్కారు లేఖ రాస్తుందని నారా లోకేష్ చెప్పారు. ప్రభుత్వం సమర్పించిన యూసీ వివరాలన్నింటినీ లేఖలో పొందుపరుస్తామని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. 
 
యూసీలు సమర్పించడంలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో వుందన్న విషయాన్ని నారా లోకేష్ గుర్తు చేశారు. అలాంటప్పుడు యూసీలను ఏపీ ఇవ్వలేదని ఆరోపణలు చేయడం ఏమిటన్నారు. ఎన్డీయే నుంచి బయటకు రావాలనే నిర్ణయాన్ని ఆవేశంలో తీసుకోలేదని.. కేంద్ర సర్కారు వైఖరి వల్లే తీసుకున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments