Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో కరోనా కలకలం : మైసూర్ ప్యాలెస్ మూసివేత

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (07:10 IST)
కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో ఇపుడు కర్నాటక రాష్ట్రం కూడా చేరిపోయింది. దీంతో ప్రఖ్యాత మైసూర్ ప్యాలెస్‌ను మూసివేశారు. ఈ ప్యాలెస్‌లో పని చేసే ఉద్యోగి బంధువులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు ఈ ప్యాలెస్‌ను మూసివేశారు. 
 
అయితే శానిటైజేషన్ తర్వాత మళ్లీ సోమవారం తెరిచే అవకాశమున్నట్లు సమాచారం. తొలుత కరోనా కారణంగా మార్చి 15 నుంచి 22 వరకూ వారం రోజుల పాటు ప్యాలెస్‌ను మూసివేసినట్లు ప్యాలెస్ కమిటీ తెలిపింది. 
 
ఇదిలావుంటే.. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం గమనార్హం. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
కొత్తగా కర్ణాటకలో 2,228 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 1,373 కేసులు బెంగళూరులోనే నమోదు కావడం గమనార్హం. మరణాల సంఖ్య కూడా కొంత ఆందోళనకరంగానే ఉంది. గత 24 గంటల్లో కర్ణాటకలో కరోనా వల్ల 17 మంది మరణించారు. దీంతో.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 486కు చేరింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments