Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో కరోనా కలకలం : మైసూర్ ప్యాలెస్ మూసివేత

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (07:10 IST)
కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో ఇపుడు కర్నాటక రాష్ట్రం కూడా చేరిపోయింది. దీంతో ప్రఖ్యాత మైసూర్ ప్యాలెస్‌ను మూసివేశారు. ఈ ప్యాలెస్‌లో పని చేసే ఉద్యోగి బంధువులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు ఈ ప్యాలెస్‌ను మూసివేశారు. 
 
అయితే శానిటైజేషన్ తర్వాత మళ్లీ సోమవారం తెరిచే అవకాశమున్నట్లు సమాచారం. తొలుత కరోనా కారణంగా మార్చి 15 నుంచి 22 వరకూ వారం రోజుల పాటు ప్యాలెస్‌ను మూసివేసినట్లు ప్యాలెస్ కమిటీ తెలిపింది. 
 
ఇదిలావుంటే.. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం గమనార్హం. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
కొత్తగా కర్ణాటకలో 2,228 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 1,373 కేసులు బెంగళూరులోనే నమోదు కావడం గమనార్హం. మరణాల సంఖ్య కూడా కొంత ఆందోళనకరంగానే ఉంది. గత 24 గంటల్లో కర్ణాటకలో కరోనా వల్ల 17 మంది మరణించారు. దీంతో.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 486కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments