Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదర్సాలో చదివేందుకు ఇష్టపడని చిన్నారులు.. కాళ్ళకు సంకెళ్లు వేయించిన కన్నతండ్రి... ఎక్కడ?

బెంగుళూరులో జరిగిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మదర్సాలో చదువుకునేందుకు నిరాకరించిన ముగ్గురు చిన్నారుల కాళ్ళకు కన్నతండ్రే సంకెళ్లు వేశాడు.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (13:17 IST)
బెంగుళూరులో జరిగిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మదర్సాలో చదువుకునేందుకు నిరాకరించిన ముగ్గురు చిన్నారుల కాళ్ళకు కన్నతండ్రే సంకెళ్లు వేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... నగరంలోని హెచ్ఎస్ఆర్‌లే అవుట్‌కు చెందిన సిరాజ్ వహాబ్‌కు ముగ్గురు కుమారులు. వారంతా 7 నుంచి పదేళ్ల వయసులోపు వారే. వారిపై గంపెడాశలు పెట్టుకున్న సిరాజ్... మదర్సాలో చదువుకోమని వారిని పురమాయించాడు. అయితే మదర్సాలో చదువుకునేందుకు ఆ ముగ్గురు బాలురు నిరాకరించారట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిరాజ్ అక్కడికి సమీపంలోని మదర్సాకు చెందిన మౌలానాతో ఈ విషయం చెప్పాడు.
 
పిల్లలకు బుద్ధి చెప్పి మదర్సాలో చదువుకునేలా చేయాలని సిరాజ్... మౌలానాను ప్రాధేయపడ్డాడు. సిరాజ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మౌలానా ఆ ముగ్గురు పిల్లల కాళ్లకు ఒకే గొలుసుతో సంకెళ్లేశాడు. దీనిపై సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు సివిల్ డ్రెస్‌లో మదర్సాకు వెళ్లి బాధిత పిల్లలతో మాట్లాడగా సిరాజ్, మౌలానా కలిసి తమకు సంకెళ్లు వేసినట్టు చెప్పారు. వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సిరాజ్, మదర్సా మౌలానాలను అదుపులోకి తీసుకుని జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు పెట్టారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments