Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానం కోసం 10 పెళ్ళిళ్లు.. కానీ ప్రయోజనం లేదు.. చివరికి హతుడైనాడు.. ఎలా?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (15:56 IST)
సంతానం కలగలేదని పది పెళ్ళిళ్లు చేసుకున్నా ఆ వ్యక్తికి ప్రయోజనం లేదు. కోట్ల రూపాయల ఆస్తి వున్నా అనుభవించే వారంటూ లేరు. అటు భార్యలు లేరు.. ఇటు పిల్లలు లేరు. దీంతో అతని ఆస్తిపై కన్నేసిన కొందరు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో వెలుగు చూసింది. 
 
వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాకు చెందిన జగన్ లాల్ యాదవ్‌ 1990 నుంచి ఇప్పటి వరకు పది పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి ఐదుగురు భార్యలు అనారోగ్యంతో చనిపోయారు. ముగ్గురు భార్యలు యాదవ్‌ను వదిలేసి వెళ్లిపోయారు. ఇక మిగిలిన ఇద్దరు భార్యలు యాదవ్‌తోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఊరికి దగ్గరలోని పంట పొలంలో జగన్‌లాల్‌ శవమై కనిపించాడు.
 
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసమే అతడ్ని చంపేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు భార్యలతో కలిసి జీవిస్తున్నాడు. వారిద్దరూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు. ఇద్దరి భార్యల్లోని.. ఒకామెకు మొదటి భర్త ద్వారా కలిగిన కుమారుడు ఉన్నాడు. అతను కూడా వీరితో కలిసి నివసిస్తున్నాడు.
 
హతుడికి మేయిన్‌ రోడ్డు పక్కన స్థలం ఉంది. దానికి మార్కెట్‌లో చాలా విలువ ఉంది. దాని కోసమే అతడ్ని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి నిత్యపెళ్లికొడుకు జగన్ లాల్ హత్య స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments