Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజే సౌండ్‌‍కు కోళ్ళకు గుండెపోటు.. 66 కోళ్లు మృతి

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (19:12 IST)
సాధారణంగా గుండెపోటు కేవలం మనుషులకు మాత్రమే వస్తుందని అనుకుంటాం. కానీ, కోళ్ళకు కూడా వస్తుందని తాజాగా వెల్లడైంది. అదీ కూడా డీజే సౌండ్‌ను తట్టుకోలేక ఏకంగా 63 కోళ్లు మృతి చెందాయి. ఈ కోళ్లన్నీ ఆ శబ్దాన్ని తట్టుకోలేక గుండెపోటు వచ్చి చనిపోయాయి. దీంతో పౌల్ట్రీఫాం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వింత కేసు ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌‍లో సంభవించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, బాలాసోర్‌కు చెందిన రంజిత్ అనే యువకుడికి పౌల్ట్రీఫాం వుంది. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ఈ యువకుడు ప్రభుత్వం ఉద్యోగం రాకపోవడంతో సొంతంగా ఈ పౌల్ట్రీని పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నాడు. 
 
ఈ క్రమంలో గత ఆదివారం ఆ ఫామ్ పక్కనే ఉన్న ఇంట్లో ఓ వివాహం జరిగింది. రాత్రి 11.30 గంటల సమయంలో చెవులకు చిల్లులు పడేలా డీజే సౌండ్ పెట్టి డ్యాన్సులు చేశారనీ, ఈ కారణంగా కోళ్లు తట్టుకోలేక అల్లాడిపోతూ అటూఇటూ కొట్టుకుంటూ పడిపోయి ప్రాణాలు విడిచాయని పేర్కొన్నాడు. 
 
కోళ్ళ పరిస్థితిని చూసి సౌండ్ తగ్గించాలని ఎంతో ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదని వాపోయాడు. మరుసటి రోజున వెటర్నరీ వైద్యుడుకు చూపించగా, అవి గుండెపోటుతో చనిపోయినట్టు నిర్దారించారని తెలిపారు. దీనికి డీజే శబ్దాలే కారణమని స్పష్టం చేసినట్టు తెలిపారు. ఈ అంశంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments