Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజే సౌండ్‌‍కు కోళ్ళకు గుండెపోటు.. 66 కోళ్లు మృతి

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (19:12 IST)
సాధారణంగా గుండెపోటు కేవలం మనుషులకు మాత్రమే వస్తుందని అనుకుంటాం. కానీ, కోళ్ళకు కూడా వస్తుందని తాజాగా వెల్లడైంది. అదీ కూడా డీజే సౌండ్‌ను తట్టుకోలేక ఏకంగా 63 కోళ్లు మృతి చెందాయి. ఈ కోళ్లన్నీ ఆ శబ్దాన్ని తట్టుకోలేక గుండెపోటు వచ్చి చనిపోయాయి. దీంతో పౌల్ట్రీఫాం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వింత కేసు ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌‍లో సంభవించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, బాలాసోర్‌కు చెందిన రంజిత్ అనే యువకుడికి పౌల్ట్రీఫాం వుంది. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ఈ యువకుడు ప్రభుత్వం ఉద్యోగం రాకపోవడంతో సొంతంగా ఈ పౌల్ట్రీని పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నాడు. 
 
ఈ క్రమంలో గత ఆదివారం ఆ ఫామ్ పక్కనే ఉన్న ఇంట్లో ఓ వివాహం జరిగింది. రాత్రి 11.30 గంటల సమయంలో చెవులకు చిల్లులు పడేలా డీజే సౌండ్ పెట్టి డ్యాన్సులు చేశారనీ, ఈ కారణంగా కోళ్లు తట్టుకోలేక అల్లాడిపోతూ అటూఇటూ కొట్టుకుంటూ పడిపోయి ప్రాణాలు విడిచాయని పేర్కొన్నాడు. 
 
కోళ్ళ పరిస్థితిని చూసి సౌండ్ తగ్గించాలని ఎంతో ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదని వాపోయాడు. మరుసటి రోజున వెటర్నరీ వైద్యుడుకు చూపించగా, అవి గుండెపోటుతో చనిపోయినట్టు నిర్దారించారని తెలిపారు. దీనికి డీజే శబ్దాలే కారణమని స్పష్టం చేసినట్టు తెలిపారు. ఈ అంశంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments