Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనువుగా మాట్లాడుతోందనీ చెంప ఛెళ్లుమనిపించిన ప్రియుడు... ప్రాణాలు విడిచిన మహిళ

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (12:40 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. తన ప్రియురాలు మరో వ్యక్తితో చనువుగా మాట్లాడటాన్ని ఓ ప్రియుడు జీర్ణించుకోలేక పోయాడు. ఈ విషయాన్ని ఆమెకు పలుమార్లు చెప్పాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో మరో వ్యక్తితో మాట్లాడుతున్న ప్రియురాలిని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన ప్రియుడు.. ఆమె చెంప ఛెళ్ళుమనిపించాడు. అంతే... ఆమె అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని మాన్ ఖుర్ద్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ప్రాంతానికి చెందిన సీతా ప్రధాన్ (35) అనే మహిళకు బాయ్‌ఫ్రెండ్ రాజు పూజారీ అనే వ్యక్తివున్నాడు. అయితే, ఈమె మరో వ్యక్తితో చనువుగా ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఆ వ్యక్తితో చనువుగా మాట్లాడుతుండటాన్ని బాయ్‌ఫ్రెండ్ చూశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే సీతా ప్రధాన్ చెంపఛెళ్లుమనింపించాడు. 
 
అంతే, ఆ మహిళ అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఘట్కోపర్‌లోని రాజావాది ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. దీనిపై ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా మాన్ ఖుర్ద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె శవపరీక్ష నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనలో రాజుని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments