Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనువుగా మాట్లాడుతోందనీ చెంప ఛెళ్లుమనిపించిన ప్రియుడు... ప్రాణాలు విడిచిన మహిళ

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (12:40 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. తన ప్రియురాలు మరో వ్యక్తితో చనువుగా మాట్లాడటాన్ని ఓ ప్రియుడు జీర్ణించుకోలేక పోయాడు. ఈ విషయాన్ని ఆమెకు పలుమార్లు చెప్పాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో మరో వ్యక్తితో మాట్లాడుతున్న ప్రియురాలిని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన ప్రియుడు.. ఆమె చెంప ఛెళ్ళుమనిపించాడు. అంతే... ఆమె అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని మాన్ ఖుర్ద్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ప్రాంతానికి చెందిన సీతా ప్రధాన్ (35) అనే మహిళకు బాయ్‌ఫ్రెండ్ రాజు పూజారీ అనే వ్యక్తివున్నాడు. అయితే, ఈమె మరో వ్యక్తితో చనువుగా ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఆ వ్యక్తితో చనువుగా మాట్లాడుతుండటాన్ని బాయ్‌ఫ్రెండ్ చూశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే సీతా ప్రధాన్ చెంపఛెళ్లుమనింపించాడు. 
 
అంతే, ఆ మహిళ అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఘట్కోపర్‌లోని రాజావాది ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. దీనిపై ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా మాన్ ఖుర్ద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె శవపరీక్ష నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనలో రాజుని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments