Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలికి ప్రాణాంతక వ్యాధి... కెటామైన విషపు సూదివేసి...

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (14:52 IST)
ముంబై మహానగరంలో ఓ దారుణం వెలుగు చూసింది. తన ప్రియురాలికి ప్రాణాంతక వ్యాధి ఉందని తెలుసుకున్న ప్రియుడు... ఆమెను పెళ్ళి చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు కదా, విషపు ఇంజెక్షన్ ద్వారా హత్య చేశాడు. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై పన్వెల్ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు ఇటీవల గుర్తించారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
పన్వెల్‌లోని ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్న చంద్రకాంత్ గైకర్ అనే వ్యక్తికి తన సోదరితో ఎఫైర్ ఉందని మృతురాలి సోదరుడు పోలీసులకు చెప్పాడు. దీంతో చంద్రకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం వెల్లడించాడు. 
 
తన ప్రియురాలి ప్రాణాంత వ్యాధితో బాధపడుతుందని, అందువల్ల ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనే భయంతో తాను అనారోగ్యానికి గురైన ప్రియురాలికి ఇంజక్షన్ ఇచ్చి చంపానని చంద్రకాంత్ అంగీకరించాడు. 
 
ప్రియురాలి అనారోగ్యం తగ్గించేందుకు ఇంజక్షన్ అని చెప్పి, కెటమైన్ ఇంజక్షన్ చేశాడని తేలింది. దీంతో నిందితుడైన చంద్రకాంత్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments