Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్నింగ్ వాక్‌కు వెళ్తే కొబ్బరి చెట్టు పడింది.. దూరదర్శన్ మాజీ యాంకర్ మృతి..

దూరదర్శన్ మాజీ యాంకర్ కంచన్ నాథ్ (58)ను ఓ కొబ్బరి చెట్టు పొట్టనబెట్టుకుంది. ముంబైలో అనూహ్య ప్రమాదం జరగడంతో కంచన్ నాథ్ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. దూరదర్శన్‌ మాజీ యాంకర్‌ కంచన్‌ నాథ్‌(58

Webdunia
శనివారం, 22 జులై 2017 (15:04 IST)
దూరదర్శన్ మాజీ యాంకర్ కంచన్ నాథ్ (58)ను ఓ కొబ్బరి చెట్టు పొట్టనబెట్టుకుంది. ముంబైలో అనూహ్య ప్రమాదం జరగడంతో కంచన్ నాథ్ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. దూరదర్శన్‌ మాజీ యాంకర్‌ కంచన్‌ నాథ్‌(58) ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో మార్నింగ్ వాక్ వెళ్లారు. 
 
ఆ సమయంలో ఇంటికి సమీపంలోని కొబ్బరి చెట్టు అకస్మాత్తుగా విరిగిపడింది. దీంతో తీవ్ర గాయాలతో అకస్మారక స్థితిలోకి జారుకున్న కంచన్ శుక్రవారం ఉదయం కన్ను మూశారు. స్థానిక సీటీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ విషాదంపై ఆమె కుటుంబ సభ్యులు ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 
 
ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఈ చెట్టును తొలగించాల్సిందిగా అవినాష్ అనే వ్యక్తి దరఖాస్తుతో పాటు రూ.1,380 డిపాజిట్ కూడా చేశాడని, ఇంకా స్థానిక కౌన్సిలర్ ఆషా మరాథే బీఎంసీ లేఖ రాసినా కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించారని కంచన్ భర్త ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments