Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిమళించిన మానవత్వం.. మహారాష్ట్ర మంత్రి ఏం చేశారో తెలుసా?

మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు.. ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకునిపోయాయి. ఫలితంగా లక్షలాది మంది ముంబై వాసులు ఆశ్రయాన్ని కోల్పోయారు. వరద నీటిలో గృహాలు మునిగిపోవడంతో ఏం చేయాలో, ఎక్కడ

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (06:17 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు.. ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకునిపోయాయి. ఫలితంగా లక్షలాది మంది ముంబై వాసులు ఆశ్రయాన్ని కోల్పోయారు. వరద నీటిలో గృహాలు మునిగిపోవడంతో ఏం చేయాలో, ఎక్కడ ఉండాలో దిక్కుతోచక తల్లడిల్లిపోతున్నారు. 
 
ముఖ్యంగా.. ముంబైలో కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో మహారాష్ట్ర మంత్రి గిరీశ్ బపత్ తన మానవత్వం చాటుకున్నారు. దక్షిణ ముంబైలో తన నివాసానికి పరిసరాల్లో ఉన్న ఫోర్ట్, మంత్రాలయ దగ్గర చిక్కుకుపోయిన ప్రజలను తన ఇంటికి వచ్చి సేద తీరాల్సిందిగా కోరారు. 
 
ఈ మేరకు గిరీశ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ప్రజలకు విన్నవించుకున్నారు. కాగా, ముంబైలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments