Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాట్‌ఫాంపై దిగగానే మహిళ బుగ్గపై ముద్దు... ఏడాది జైలు, రూ.10వేల జరిమానా

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (17:12 IST)
మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్న తరుణంలో.. ఓ మహిళ బుగ్గపై ముద్దు పెట్టినందుకు నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ముంబై మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనపై తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. 2015, ఆగస్టు 26న బాధిత మహిళ తన స్నేహిడితో కలిసి గోవాండి నుంచి లోకల్ ట్రైన్‌లో సీఎస్‌ఎంటీ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ప్లాట్‌ఫాంపై దిగగానే కిరణ్ హోనోవర్(37) ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. బలవంతంగా తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని బాధితురాలు పేర్కొంది.
 
ఈ ఘటన అనంతరం బాధితురాలు సీఎస్‌ఎంటీ రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు నిందితుడిపై సెక్షన్ 354, 354 (ఎ) (1) కింద కేసు నమోదు చేశారు. దాదాపు ఏడేళ్లుగా ఈ కేసు కోర్టులో ఉంది. సంబంధిత సాక్షులందరినీ విచారించిన అనంతరం ఫోర్ట్ కోర్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వీఎస్పీ కేదార్ నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష పదివేల రూపాయల జరిమానా విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments