Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాస్‌మేట్‌ను జైల్లో పెట్టించిన రైల్వే మంత్రి

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (10:08 IST)
కేంద్ర మంత్రుల్లో మచ్చలేని వారిలో రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఒకరు. ఈయన తాజాగా తన క్లాస్‌మేట్‌ను జైల్లో పెట్టించారు. తన క్లాస్‌మేట్ ఓ మోసగాడని తెలిసి అతనిపై కేసు పెట్టించిమరీ అరెస్టు చేయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై నగరానికి చెందిన మాటుంగ ప్రాంత వ్యక్తి, జ్యోతి కుమార్ అగర్వాల్ (50) అనే వ్యక్తి పియూష్ గోయల్ స్కూల్‌మేట్. చిన్నప్పుడు వారిద్దరూ కలిసి చదువుకున్నారు. గత యేడాది సెప్టెంబరు నెలలో తన స్కూల్ పూర్వ విద్యార్థుల సమావేశం జరుగగా, పియూష్ గోయల్ హాజరయ్యారు. అపుడు జ్యోతి కుమార్ తనను తాను పరిచయం చేసుకుని ఫోటోలు దిగాడు. 
 
ఆ తర్వాత ఆ ఫోటోలు చూపిస్తూ పలువురుని మోసం చేయసాగాడు. మనీష్ చగన్ లాల్ అనే వ్యక్తికి వాటిని చూపించి, పియూష్‌తో మాట్లాడి, రైల్వే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. పియూష్‌కు దీపావళి కానుకను పంపుదామని చెప్పి రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. 
 
ఆపై కాంట్రాక్ట్ మాటెత్తకపోవడంతో, తనకున్న పరిచయాలతో పియూష్‌ను మనీష్ సంప్రదించి, జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించాడు. దీంతో జ్యోతికుమార్ మోసగాడని, కేసు పెట్టి అరెస్ట్ చేయాలని పియూష్ స్వయంగా ముంబై పోలీసులను ఆదేశించారు. దీంతో కదిలిన పోలీసులు, జ్యోతికుమార్ అగర్వాల్‌పై కేసు పెట్టి అరెస్టు చేయించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments