Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు మిస్డ్ కాల్స్.. రూ.1.86 కోట్లను కాజేశాయి... ఎలా?

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (11:18 IST)
ముంబైలోని ఓ వ్యాపారవేత్త బ్యాంక్ అకౌంట్ నుంచి ఆరు మిస్డ్ కాల్స్‌ ద్వారా రూ.1.86 కోట్ల నగదును గుంజేశారు. ఈ ఘటన వాణిజ్య రాజధాని ముంబైలో పెను సంచలనానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే.. సెట్రల్ ముంబై ప్రాంతానికి చెందిన బిజినెస్‌మేన్ మహీమ్. ఇతడు ఓ టెక్స్‌టైల్ వ్యాపారి. ఇతడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు.
 
ఆ ఫిర్యాదులో తన స్మార్ట్‌ఫోనుకు ఆరు మిస్డ్ కాల్స్ వచ్చాయని.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయిందని.. ఉదయం తన అకౌంట్ నుంచి రూ.1.86కోట్ల నగదును ఇతర బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ అయివుందని తెలిపాడు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీ, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ వంటి జిల్లాలకు చెందిన వారికి మహీమ్ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ అయిన విషయాన్ని గుర్తించారు. 
 
14 బ్యాంక్ అకౌంట్లకు 28 సార్లు మనీ ట్రాన్స్‌ఫర్ అయ్యిందని పోలీసులు తెలిపారు. టెక్నాలజీ పేరిట ఈ డబ్బును ఇతర అకౌంట్లకు పంపించినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. మహీమ్ అకౌంట్ నుంచి రూ.20లక్షలను మాత్రమే కాపాడగలిగామని.. మిగిలిన డబ్బు ఇతర అకౌంట్లకు వెళ్ళిపోయాయని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments