Webdunia - Bharat's app for daily news and videos

Install App

గగనంలో ఆగిపోయిన ఇంజన్.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Webdunia
శనివారం, 21 మే 2022 (09:29 IST)
ఎయిర్ ఇండియా విమానానికి పెను ముప్పు తప్పింది. ముంబై నుంచి బెంగుళూరుకు బయలుదేరిన ఎయిరిండియా విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. గగనతలంలో ఉండగానే ఒక్కసారిగా ఆ విమానం ఇంజిన్ ఒకటి మొరాయించింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. దీంతో విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, గురువారం ఉదయం 9.43 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 నియో విమానం బెంగుళూరుకు బయలుదేరింది. 
 
రెండు సీఎఫ్ఎం ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో ఒకటి గగనతలంలో ఉండగానే మొరాయించింది. ఇంజిన్ పని చేయడం ఆగిపోవడాన్ని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. 
 
వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి, సమాచారాన్ని విమానాశ్రయ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ తర్వాత ప్రయాణికులను మరో విమానంలో బెంగుళూరుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments