Webdunia - Bharat's app for daily news and videos

Install App

గగనంలో ఆగిపోయిన ఇంజన్.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Webdunia
శనివారం, 21 మే 2022 (09:29 IST)
ఎయిర్ ఇండియా విమానానికి పెను ముప్పు తప్పింది. ముంబై నుంచి బెంగుళూరుకు బయలుదేరిన ఎయిరిండియా విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. గగనతలంలో ఉండగానే ఒక్కసారిగా ఆ విమానం ఇంజిన్ ఒకటి మొరాయించింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. దీంతో విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, గురువారం ఉదయం 9.43 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 నియో విమానం బెంగుళూరుకు బయలుదేరింది. 
 
రెండు సీఎఫ్ఎం ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో ఒకటి గగనతలంలో ఉండగానే మొరాయించింది. ఇంజిన్ పని చేయడం ఆగిపోవడాన్ని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. 
 
వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి, సమాచారాన్ని విమానాశ్రయ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ తర్వాత ప్రయాణికులను మరో విమానంలో బెంగుళూరుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments