Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్‌లో విషాదం : 9 మంది టూరిస్టుల మృతి

Himachal Pradesh
Webdunia
ఆదివారం, 25 జులై 2021 (17:18 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన జరిగింది. కొండ చరియలు విరిగిపడటంతో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. ఈ కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీయగా అవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
రాష్ట్రంలోని కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంగ్లా - చిత్కుల్ రహదారిలలో బత్సేరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతులంతా ఢిల్లీకి చెందిన వారేనని అక్కడి అధికారులు చెప్పారు. 
 
ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో పెద్ద పెద్ద బండరాళ్లు కిందకు దూసుకొచ్చాయి. బత్సేరి లోయలో ఉన్న ఓ బ్రిడ్జిపై పడడంతో అది కుప్పకూలింది. అంతేకాదు పక్కనే ఉన్న పలు కార్లలపై బండరాళ్ల పడ్డాయి. ఈ ఘటనలో పలు కార్లు, పర్యాటకుల విశ్రాంతి గదులు ధ్వంసమయ్యాయి. చిత్కుల్ నుంచి సంగ్లాకు వెళ్తున్న ఓ వాహనంపై పడడంతో అందులో ప్రయాణిస్తున్న 9 మంది చనిపోయారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments