Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్‌లో విషాదం : 9 మంది టూరిస్టుల మృతి

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (17:18 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన జరిగింది. కొండ చరియలు విరిగిపడటంతో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. ఈ కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీయగా అవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
రాష్ట్రంలోని కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంగ్లా - చిత్కుల్ రహదారిలలో బత్సేరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతులంతా ఢిల్లీకి చెందిన వారేనని అక్కడి అధికారులు చెప్పారు. 
 
ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో పెద్ద పెద్ద బండరాళ్లు కిందకు దూసుకొచ్చాయి. బత్సేరి లోయలో ఉన్న ఓ బ్రిడ్జిపై పడడంతో అది కుప్పకూలింది. అంతేకాదు పక్కనే ఉన్న పలు కార్లలపై బండరాళ్ల పడ్డాయి. ఈ ఘటనలో పలు కార్లు, పర్యాటకుల విశ్రాంతి గదులు ధ్వంసమయ్యాయి. చిత్కుల్ నుంచి సంగ్లాకు వెళ్తున్న ఓ వాహనంపై పడడంతో అందులో ప్రయాణిస్తున్న 9 మంది చనిపోయారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments