Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిటికల్ కేర్ యూనిట్‌లో ములాయం సింగ్ : మేదాంత ఆస్పత్రి

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (10:58 IST)
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వృద్ధనేత, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం మరింత విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నారు. 
 
అయితే, ములాయం సింగ్‌కు కిడ్నీలు పాడైపోయినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కిడ్నీలు దానం చేసేందుకు పార్టీ కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. అదేసమయంలో కార్యకర్తలు నేతాజీ అని ముద్దుగా పిలుచుకునే ములాయంను చూసేందుకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దంటూ సమాజ్‌వాదీ పార్టీ కోరింది. 
 
ప్రస్తుతం వెంటిలేటర్‌పై ములాయం సింగ్‌కు ఐసీయూ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆస్పత్రికి ఎవరూ రావొద్దంటూ కోరింది. అదేసమయంలో నేతాజీ ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికపుడు తెలియజేస్తామని తెలిపింది. మరోవైపు, ములాయం త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments