Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

సెల్వి
గురువారం, 24 ఏప్రియల్ 2025 (20:14 IST)
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గమ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దారుణమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ముఖేష్ అంబానీ దీనిని ఒక దారుణమైన సంఘటనగా అభివర్ణించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు.
 
దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ముఖేష్ అంబానీ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవడానికి కీలక చర్యను ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ముంబైలోని సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో గాయపడిన వారికి అత్యున్నత నాణ్యత గల వైద్య చికిత్స పూర్తిగా ఉచితంగా లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ఉగ్రవాదాన్ని మానవాళికి తీవ్ర ముప్పుగా అభివర్ణించిన ముఖేష్ అంబానీ, దానిని ఏ రూపంలోనైనా సహించకూడదని నొక్కి చెప్పారు. ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడే వారిని వదిలిపెట్టకూడదని పునరుద్ఘాటించారు.
 
ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ పూర్తిగా మద్దతు ఇస్తుందని ముఖేష్ అంబానీ ఒక బహిరంగ ప్రకటనలో ధృవీకరించారు. జాతీయ భద్రతకు సంబంధించిన అన్ని విషయాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రభుత్వానికి దృఢంగా మద్దతు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments