Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇందిరా గాంధీకి హడలెత్తించిన కరుణానిధి... జాతీయ జెండా ఎగురవేసిన తొలి సీఎం

కరుణానిధి ఓ ధిక్కార స్వరం, హక్కుల కోసం పోరాడిన యోధుడు. జాతిని ఏకతాటిపై తెచ్చిన ఓ మహా నాయకుడు.. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు ప్రాధాన్యం, హక్కల కోసం కరుణానిధి గట్టిగా పోరాడారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆకాంక్షించేవారు. 1974 సంవత్సరం వరకూ స్

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (08:49 IST)
కరుణానిధి ఓ ధిక్కార స్వరం, హక్కుల కోసం పోరాడిన యోధుడు. జాతిని ఏకతాటిపై తెచ్చిన ఓ మహా నాయకుడు.. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు ప్రాధాన్యం, హక్కల కోసం కరుణానిధి గట్టిగా పోరాడారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆకాంక్షించేవారు. 1974 సంవత్సరం వరకూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గవర్నర్లు మాత్రమే రాష్ట్రాల్లో జాతీయజెండా ఎగురవేసేవారు. 
 
ముఖ్యమంత్రలకు జెండా ఎగురవేసే సంప్రదాయం ఉండేది కాదు. దీనిని వ్యతిరేకించిన కరుణ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి ఘాటుగా ఓ లేఖ వ్రాసారు. దీనికి ప్రతి స్పందించిన రాష్ట్రాల్లో ఆగష్టు 15న ముఖ్యమంత్రులు, జనవరి 26న గవర్నర్లు జెండా ఎగురవేయాలని కేంద్రం ప్రకటించింది. దీంతో 1974 ఆగష్టు 15న ముఖ్యమంత్రిగా జెండా ఎగురవేశారు కరుణానిధి. 
 
అలా జాతీయ జెండా ఎగుర వేసిన తొలిముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రులకు జాతీయ జెండా ఎగురవేసే హక్కును సాధించిన యోధుడుగా కరుణానిధి చరిత్రలో నిలబడ్డారు. అంతేకాదు ఆయన తమిళనాడు కోసం ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments