Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలకు కరోనా పరీక్షలు... జీరో టచ్ సెక్యూరిటీ : లోక్‌సభ స్పీకర్

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (22:38 IST)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబరు ఒకటో తేదీ వరకు జరిగే ఈ సమావేశాలను రెండు షిప్టుల్లో నిర్వహించనున్నారు. అయితే, ఈ సమావేశాల ప్రారంభానికి 72 గంటల ముందు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని లోక్‌సభ సభ్యులందరికీ స్పీకర్ ఓం బిర్లా సూచించారు. 
 
ఈ సమావేశాల ఏర్పాట్లలో భాగంగా, ఆయన శుక్రవారం ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులు, డీఆర్డీవో అధికారులతో ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, 'ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సంస్థల నిర్వహణకు కోవిడ్-19 ప్రధాన సవాలు విసిరింది. కోవిడ్ సంబంధిత నియమ నిబంధనలను పాటించడం ద్వారా పార్లమెంటు సమావేశాలకు సభ్యులంతా సహకరిస్తారని ఆశిస్తున్నా' అని పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, ఎంపీలతో పాటు పార్లమెంటు ఆవరణలో ప్రవేశించే అధికారుల నుంచి మంత్రులు, మీడియా ప్రతినిధులు, లోక్‌సభ సిబ్బంది, రాజ్యసభ కార్యదర్శులంతా పార్లమెంట్ సమావేశాలకు ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, జీరో-టచ్ సెక్యూరిటీ తనిఖీల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments