Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను హత్యచేసింది.. వంటింట్లో పాతిపెట్టి ఎప్పటిలాగానే హాయిగా వంట చేసుకుని?

Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (16:44 IST)
సామాజిక మాధ్యమాల ప్రభావం, స్మార్ట్ ఫోన్ల వ్యవహారంతో మానవులు ఉన్మాదులుగా మారిపోతున్నారు. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఫలితంగా వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ మహిళ భర్తను పొట్టనబెట్టుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా అఘాయిత్యానికి పాల్పడింది.

కట్టుకున్న భర్తను దారుణంగా చంపిన ఆమె వంటగదిలోనే పాతి పెట్టి ఎప్పటిలాగే వంటచేసుకుంటూ జీవిస్తున్న మహిళను మధ్యప్రదేశ్ పోలీసులు నాటకీయ ఫక్కీలో అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే... అనుప్పూర్ జిల్లాలోని కరోండి గ్రామానికి చెందిన మహేష్ బన్వాల్ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రమీళతో ఆమెకు ఇటీవలే వివాహం అయ్యింది. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండేవి. 
 
ఈ క్రమంలోనే మహేష్ సోదరుడు గంగారంతో ప్రమీలకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వీరి అక్రమ సంబంధానికి మహేష్ బన్వాల్ అడ్డు వస్తున్నాడని అతని అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అంతే మహేష్‌ను అక్టోబర్ 22వ తేదీన చంపేశారు. ఇంకా భర్త కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా నివ్వెర పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ప్రమీలపై మహేష్ సోదరుడు అర్జున్ బన్వాల్‌కి అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రమీల ఇంటిని తనిఖీ చేస్తున్నసమయంలో, వంటగదిలోంచి దుర్వాసన రావడంతో అనుమానంతో అక్కడ తవ్విచూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహేశ్ శవాన్నిగుర్తించి వెలికి తీశారు.

అనంతరం ప్రమీళ, గంగారం వద్ద జరిపిన విచారణలో మహేష్‌ను హత్య చేసి వంటింట్లోనే పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు. నెలపాటు వంటింట్లో భర్త శవాన్ని పాతిపెట్టి అక్కడే వంట వండుకుని తినినట్లు ప్రమీళ పోలీసులతో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments