Webdunia - Bharat's app for daily news and videos

Install App

షేవింగ్ బ్లేడ్‌తో సిజేరియన్.. తల్లీబిడ్డ మృతి.. ఎక్కడో తెలుసా?

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (19:28 IST)
Blade
గర్భిణీకి సిజేరియన్ ఆపరేషన్‌ను షేవింగ్ బ్లేడ్‌తో చేశాడు.. ఓ శారదా ఆస్పత్రి నిర్వాహకుడు. దీంతో తల్లీ బిడ్డ ప్రాణాలు కోల్పోయిన ఘటన యూపీలోని సుల్తాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుల్తాన్‌పూర్‌, సైని గ్రామంలోని మా శారదా ఆసుపత్రి నిర్వాహకుడు రాజేష్‌ సాహ్ని అనర్హులతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాడు. పూనం అనే నిండు గర్భిణీని డెలివరీ కోసం ఆమె కుటుంబ సభ్యులు ఆ క్లినిక్‌కు తీసుకొచ్చారు. 
 
ఈ నేపథ్యంలో 8వ తరగతి చదువును మధ్యలో ఆపేసి స్కూల్‌ మానేసిన రాజేంధ్ర శుక్లా అనే వ్యక్తి గడ్డం గీసుకునే బ్లేడ్‌తో ఆమెకు సిజేరియన్ ఆపరేషన్‌ చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆ మహిళ చనిపోయింది. కొంతసేపటి తర్వాత బిడ్డ కూడా మరణించింది. 
 
మహిళ భర్త రాజారామ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్లినిక్‌లో ఎలాంటి వైద్య సదుపాయాలు లేవని, అనర్హులతో శాస్త్రచికిత్సలు చేసి రోగుల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. 
 
దర్యాప్తు చేసిన పోలీసులు దీనిని నిర్ధారించుకున్నారు. రాజేంద్ర శుక్లాతోపాటు రాజేష్‌ సాహ్నిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అక్రమ క్లినిక్‌లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని చీఫ్‌ మెడికల్‌ అధికారికి పోలీసులు లేఖ రాశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments