ఇంట్లో 26 పిల్లలకు జన్మనిచ్చిన కోబ్రా... హడలిపోయిన కుటుంబ సభ్యులు

Webdunia
శనివారం, 10 జులై 2021 (15:55 IST)
సాధారణంగా కోబ్రా (త్రాచు పాము)ను చూస్తే ప్రతి ఒక్కరూ వణికిపోతారు. అలాంటి కోబ్రా ఏకంగా ఇంట్లో చేరి 26 పిల్లలకు జన్మనిస్తే.... ఈ విషయం తెలిసిన ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎక్కడి నుంచి వ‌చ్చిందో, ఎలా వ‌చ్చిందోగానీ ఓ ఇంట్లో ఓ నాగుపాము స్వేచ్ఛగా నివాస స్థావరాన్ని ఏర్పరుచుకుంది. ఆ ఇంట్లోనే గుడ్లు పెట్టి పిల్లలను కూడా చేసింది. 
 
అది ఒకటి రెండు కాదు.. ఏకంగా 26 పిల్లలను చేసింది. అయినా కానీ ఆ ఇంట్లో వారికి పాము కంట‌ప‌డ‌లేదు. ఎవ‌రికీ ఎలాంటి హాని కూడా తలపెట్టలేదు.ఇన్నాళ్లూ గుట్టుచ‌ప్పుడు కాకుండా ఉన్న పాము శుక్రవారం.. ఆ ఇంటి య‌జ‌మాని కంట‌ ప‌డింది. 
 
దీంతో ఆ ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులందరూ భయంతో పరుగులు తీశారు. ఇంటి య‌జ‌మాని ఫిర్యాదు తర్వాత అక్కడకు చేరుకున్న అట‌వీ సిబ్బంది ఆ తాచు పామును బంధించారు. ఆ పాముతోపాటు మొత్తం 26 పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించి అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు.
 
త‌ల్లి పాముతోపాటు 26 పిల్లలను పట్టుకొని ఓ సంచిలో బంధించారు. ఆ తర్వాత స‌మీప అట‌వీ ప్రాంతంలో వ‌దిలేసినట్లు కలహండి అటవీ శాఖ స్నేక్ క్యాచర్ బీరేంద్ర కుమార్ సాహు వెల్లడించారు. ఈ షాకింగ్ సంఘటన ఒడిశా రాష్ట్రం క‌ల‌హండి జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments