Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరస్ పోయిందిలే అనుకోవద్దు.. గర్భిణుల్లో ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువ

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (13:12 IST)
కరోనా కేసులు తగ్గిపోతున్నాయి.. వైరస్ పోయిందిలే అనుకుంటే పొరపాటే.. చిన్నపెద్ద అనే తేడాలేదు.. అందరికి వైరస్ ముప్పు ఉన్నట్టే.. ప్రత్యేకించి కొవిడ్ సోకిన గర్బిణుల్లో ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. 
 
సాధారణ కరోనా బాధిత వ్యక్తులతో పోలిస్తే గర్భిణుల్లో కరోనా సోకితే ముప్పు అధికంగా ఉంటుందని గుర్తించారు. అందుకే కరోనా బాధిత గర్భిణికి తక్షణ వైద్య పర్యవేక్షణ అవసరమని సూచిస్తున్నారు. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్ఆర్) అధ్యయనం ఒక ప్రకటనలో తెలిపింది.
 
ఇటీవల కరోనా కేసులు ఎక్కువగా నమోదైన మహారాష్ట్రలో గర్భిణీలే ఎక్కువ మంది ఉన్నారని ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది. రాష్ట్రంలోని పలు ఇన్సిస్టిట్యూట్‌లు, ఆస్పత్రుల సహకారంతో మొదటిసారి సమగ్ర అధ్యయనాన్ని ఐసీఎంఆర్ నిర్వహించింది. 2020 మార్చి నుంచి 2021 జనవరి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా 4,203 మంది కరోనా సోకిన గర్భిణుల నుంచి సమాచారాన్ని ఐసీఎంఆర్ సేకరించింది.
 
అనంతరం ఆ డేటాను విశ్లేషించింది. ఆ డేటాలో 3,213 వరకు జననాలు ఉండగా, 77వరకు గర్భస్రావాలు నమోదైనట్టు గుర్తించారు. 528 మందికి నెలలు నిండకముందే ప్రసవం అయినట్టు గుర్తించారు. అలాగే 328 మంది గర్భిణుల్లో రక్తపోటు సమస్యలు అధికంగా ఉన్నాయని గుర్తించారు. పిండ విచ్ఛిత్తి, మృతశిశువుల జననం నిష్పత్తి ఆరు శాతంగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయోత్సవం జరుపుకుంటున్న నాని- వాల్ పోస్టర్ బేనర్లో కొత్తవారితో సినిమా

ప్రభాస్ తో బిగ్గర్ రోల్ వుండే సినిమా చేయాలని ఉంది : ఫరియా అబ్దుల్లా

వరద బాధితులకు అండగా నిలుస్తాం: చిత్ర పరిశ్రమ

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

మిస్టర్ సెలెబ్రిటీ చిత్రంలో వినాయకచవితి పాటలో అలరించిన వరలక్ష్మీ శరత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

బెల్లం టీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

చింతపండు పేస్ట్‌తో ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే ఏంటి లాభం?

శరదృతువు వచ్చింది .. ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో ఆనందం పంచుతుంది

ప్యాకేజ్డ్ జ్యూస్‌లు వద్దండోయ్.. తాజా పండ్ల రసాలే ముద్దు

తర్వాతి కథనం
Show comments