మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాల్లో వార్ రూమ్ ఏర్పాటుకు ఆదేశం

ఠాగూర్
మంగళవారం, 28 అక్టోబరు 2025 (17:23 IST)
మొంథా తుఫాను రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. దీంతో కేంద్ర రైల్వే శాఖ కూడా అలెర్ట్ అయింది. ఈ తుఫాను కారణంగా ఏదేని తీరని నష్టం జరిగితే తక్షణం చర్యలతో పాటు సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా వార్ రూమ్‍‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ ఆదేశించింది. 
 
ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వనీ వైష్ణవ్ దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్లను ఆదేశించారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు డివిజన్లలో అవసరమైన సామగ్రి, యంత్రాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జీఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 
 
మొంథా తుఫాను దృష్ట్యా తీసుకుంటున్న చర్యలపై నివేదిక కోరారు. తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై దిశానిర్దేశం చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర వేళల్లో సత్వరం స్పందించాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments