Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.10 కోట్లు గెలుచుకున్న 11 మంది మహిళలు

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (09:19 IST)
కేరళకు చెందిన 11 మంది మహిళలకు అదృష్ణం అనూహ్యంగా వరిచింది. వారంతా రాత్రికి రాత్రి వారంతా లక్షాధికారులైపోయారు. రూ.250 లాటరీ టిక్కెట్టును 11 మంది డబ్బులు పోగేసి మరీ కొనుగోలు చేశారు. ఆ టిక్కెట్‌కు ఏకంగా రూ.10 కోట్ల బంపర్ డ్రా తగిలింది. దీంతో వారు కోట్లాది రూపాయలను గెలుచుకున్నారు. 
 
కేరళ రాష్ట్రంలోని పరప్పన్‌గడీ మున్సిపాలిటీకి చెందిన హరిత కర్మ సేనకు చెందిన ఈ మహిళలు స్థానికంగా నాన్ బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించిన రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలించే పనులు చేస్తుంటారు. అలా వచ్చే కొద్ది పాటి ఆదాయమే వారి జీవనాధారం. ముఖ్యంగా వారి కుటుంబాలకున్న ఏకైక ఆదాయ వనరు.
 
ఈ నేపథ్యంలో ఇటీవల కేరళ బంపర్ డ్రా లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే, వారివద్ద కేవలం పాతిక రూపాయలు కూడా లేని పరిస్థితి. దీంతో, కొందరు అప్పు చేసి మరీ మొత్తం రూ.250తో ఓ లాటరీ టిక్కెట్టు కొనుక్కున్నారు. బుధవారం కేరళ లాటరీ డిపార్టుమెంట్ లాటరీ నిర్వహించగా వీరికి రూ.10 కోట్ల విలువైన మానసూన్ బంపర్ లాటరీ దక్కింది. 
 
దీంతో, ఆ మహిళల ఆనందానికి అంతేలేకుండా పోయింది. తాము జీవితంలో చాలా కష్టాలు పడుతున్నామని, ఈ డబ్బుతో కొంతమేర సమస్యలు తీరుతాయని హర్షం వ్యక్తం చేశారు. రాత్రికిరాత్రి లక్షాధికారులైన వీరికి బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments