Webdunia - Bharat's app for daily news and videos

Install App

2జీ స్పెక్ట్రమ్ కేసులో దయాళు అమ్మాళ్‌కు విముక్తి కల్పించలేం!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (08:55 IST)
2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మొదటి భార్య దయాళు అమ్మాళ్‌కు విముక్తి కల్పించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆమె దాఖలు చేసుకున్న పిటీషన్‌‍ను కోర్టు కొట్టివేసింది. అదేసమయంలో ఈ కేసు విచారణ సమయంలో ఆమెతో పాటు కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా, ఇతర నిందితులు స్వయంగా కోర్టుకు హాజరుకావాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. 
 
మరోవైపు మనీ లాండరింగ్ కేసులో దయాళు అమ్మాళ్, డీఎంకే ఎంపీ కనిమొళికి తాత్కాలిక ఉపశమనం లభించింది. స్పెక్ట్రం కుంభకోణం కేసులో దయాళు అమ్మాళ్, కనిమొళితో పాటు కేంద్ర మాజీ మంత్రి రాజా, ఇతరులకు ఢిల్లీ పాటియాలా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరితో ఐదు లక్షల వ్యక్తిగత పూచికత్తు బాండు, అంతే మొత్తాలకు మరో ఇద్దరితో వ్యక్తిగత పూచీ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments