Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల వలలో నోట్ల కట్టలు.. షాకైన బాలుడు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 12 మే 2020 (18:28 IST)
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్‌లో వుండి బోర్ కొట్టేసింది. దీంతో ఓ బాలుడు చేపల వేటకు వెళ్లాడు. ఎప్పటిలాగానే వల వేశాడు. కానీ చేపలు చిక్కలేదు. నోట్ల కట్టలు చిక్కాయి. అంతే షాకైయ్యాడు. ఆ నోట్ల కట్లను ఇంటికి తెచ్చాడు. అన్నీ రూ. 500,రూ. 2000 నోట్లే. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ అరుద్ గ్రామానికి చెందిన ఓ బాలుడు చేపల వేటకు వెళ్లాడు. ఎప్పట్లానే వల వేశాడు.
 
అయితే ఎవరు.. ఎప్పుడు..ఎందుకు వేశారో తెలియదు కానీ అందులోనుంచి నోట్ల కట్ట బయటకు వచ్చింది. వాటిని బయటకు తీయగానే.. గాలి బలంగా వీయడంతో నోట్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. మెల్లగా వాటిని ఏరుకొని ఇంటికి వెళ్లాడు. 
 
ఈ విషయం తెలియరావడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నోట్ల కట్టను ఎవరు..? ఎందుకు..? అలా నీళ్లలో కరెన్సీని ఎందుకు విసిరేశారనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments