Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత రాష్ట్రపతిగా మోహన్ భగవత్ : శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ప్రతిపాదన

భారత తదుపరి రాష్ట్రపతి ఎవరన్న దానిపై ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీయే రెండోసారి పోటీలో ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమ

Webdunia
సోమవారం, 8 మే 2017 (13:45 IST)
భారత తదుపరి రాష్ట్రపతి ఎవరన్న దానిపై ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీయే రెండోసారి పోటీలో ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైన శివసేన మాత్రం సరికొత్త పేరును తెరపైకి తెచ్చింది. సెక్యులర్ దేశమైన భారతదేశాన్ని పూర్తిగా హిందూదేశంగా మార్చాలనుకుంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను తదుపరి రాష్ట్రపతిగా చేయాలని ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే సూచించారు. హిందూ రాజ్య స్థాపనే తమ ప్రథమ లక్ష్యమని, ఆ దిశగా కేంద్రం కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
ఒక్క కేంద్రంలోనే కాకుండా, దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాల్లో బీజేపీ లేదా బీజేపీ మిత్రపక్షాలే అధికారంలో ఉన్నాయని గుర్తుచేశారు. అందువల్ల భగవత్‌ను రాష్ట్రపతి ఎన్నికల్లో నిలపాలని కోరారు. ఈమేరకు తమ పార్టీ అధికార పత్రిక సామ్నాలోని కథనంలో... హిందూ దేశాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో భాగంగా మోహన్ భగవత్‌ను రాష్ట్రపతిని చేయాల్సిన అవసరం ఉందని ఉద్ధవ్ పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భగవత్ స్పందించారు. తనకు రాష్ట్రపతి కావాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదని ఆయన తేల్చిచెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments