రాహుల్ 'పప్పు' కాదు.. నిప్పు... : శివసేన ఎంపీ సంజయ్ రౌత్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రసంశల వర్షం కురిపించారు. రాహుల్ 'పప్పు' కాదనీ, నిప్పు అని త్వరలోనే నిరూపితమవుతుందన్నారు. అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటైన వి

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (10:52 IST)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రసంశల వర్షం కురిపించారు. రాహుల్ 'పప్పు' కాదనీ, నిప్పు అని త్వరలోనే నిరూపితమవుతుందన్నారు. అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటైన విమర్శలు చేశారు. 
 
తాజాగా ఆయన ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు దేశ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశాయన్నారు. ఈ రెండింటివల్ల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందన్నారు. 
 
దేశంలో చాలా మంది నేతలు తమకుతామే గొప్ప అని విర్రవీగుతున్నారని... రాహుల్ గాంధీని 'పప్పు' అంటూ సంబోధిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. రానున్న రోజుల్లో రాహుల్ ప్రభావం ఏంటో అందరికీ తెలుస్తుందన్నారు. 
 
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్ స్పష్టమైన ప్రభావం చూపే పరిస్థితి నెలకొందన్నారు. దేశాన్ని సమర్థవంతంగా నడిపించే శక్తి రాహుల్‌కు మాత్రమే ఉందని చెప్పారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న శివసేన... రాహుల్ గాంధీపై పొగడ్తల వర్షం కురిపించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments