Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశంలో తాను ఓ జాత్యహంకార బాధితుడుని : మిజోరాం ముఖ్యమంత్రి

మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో నివశించే ప్రజలే తమ దేశ ప్రజల నుంచి జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నారనీ, అలాంటి బాధితుల్లో తాను ఒకడినని గుర్తు చేశారు.

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (16:34 IST)
మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో నివశించే ప్రజలే తమ దేశ ప్రజల నుంచి జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నారనీ, అలాంటి బాధితుల్లో తాను ఒకడినని గుర్తు చేశారు. ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈశాన్య భారతదేశ ప్రజలు స్వదేశంలోని పలు ప్రధాన నగరాల్లో జాత్యహంకారానికి బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మనదేశంలో జాత్యహంకారం అత్యంత నీచమైనదని, తాను స్వయంగా అనేకసార్లు ఈ దురహంకారానికి గురయ్యానని తెలిపారు. సుమారు 20-25 సంవత్సరాల క్రితం తాను ఓ విందుకు హాజరయ్యానని, అక్కడ ఓ వ్యక్తి తనతో మాట్లాడుతూ ‘‘మీరు భారతీయుడిలా లేరు’’ అన్నాడని చెప్పారు. అందుకు తాను బదులిస్తూ ‘‘భారతీయుడు ఎలా కనిపిస్తాడో ఒక వాక్యంలో చెప్పు’’ అని తాను అడిగినట్లు తెలిపారు. సామాన్యులు మాత్రమే కాదని, జాతీయ స్థాయి నాయకులకు కూడా, వారు బీజేపీవారైనా, కాంగ్రెస్‌వారైనా, దేశం గురించి తెలియదన్నారు. 
 
ప్రపంచంలోని ప్రధాన జాతులు భారతదేశంలో ఉన్నట్లు జాతీయ నేతలకు తెలియదన్నారు. దక్షిణాదిలో ద్రావిడులు, ఉత్తరాదిలో ఆర్యులు, ఈశాన్యంలో మంగోలులు ఉన్నట్టే దేశంలో అనేక ఆదివాసీ జాతులకు చెందిన ప్రజలు కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయవాదం అత్యధికంగా ఉండటానికి ఇదే కారణమన్నారు. కాగా, 74 ఏళ్ళ వయసుగల తన్హావ్లా మిజోరాం ముఖ్యమంత్రిగా ఐదోసారి బాధ్యతలు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments