ఒరిస్సా రాష్ట్రంలో అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పద మృతి

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (11:37 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఓ అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. రాష్ట్రంలోని రూర్కెలాలో అసిస్టెంట్ కలెక్టరుగా పని చేస్తున్న సస్మిత మింజ్ (35) ఈ నెల 15వ తేదీన విధులకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే, ఈ నెల 17వ తేదీన ఆమె ఓ హోటల్‌లో ఉన్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. అక్కడకు వెళ్లిన కుటుంబ సభ్యులను కలిసేందుకు ఆమె నిరాకరించారు. పిమ్మట రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహం ఓ జలాశయం వద్ద లభించింది. 
 
తనకు విశ్రాంతి కావాలని చెప్పి ఆమె వారిని కలిసేందుకు నిరాకరించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆమె మృతదేహం పట్టణంలోని జలాశయంలో కనిపించింది. తీరంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్, చెప్పులను గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏకంగా ఓ అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందడం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments