చెన్నైలో అదృశ్యమైన విమానం... తూర్పుగోదావరి అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టిందా?
చెన్నై, తాంబరం ఎయిర్బేస్ నుంచి పోర్ట్బ్లెయిర్కు బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే అదృశ్యమైంది. ఈ విమానం తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
చెన్నై, తాంబరం ఎయిర్బేస్ నుంచి పోర్ట్బ్లెయిర్కు బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే అదృశ్యమైంది. ఈ విమానం తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
వాయుసేనకు చెందిన ఏఎన్-32 రకం విమానం శిక్షణలోభాగంగా తాంబరం ఎయిర్బేస్ నుంచి పోర్ట్బ్లెయిర్కు బయలుదేరింది. ఆ తర్వాత అది అదృశ్యమైపోయింది. ఈ విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా.. ఇస్రో శాటిలైట్ సాయం కోరినా.. ఆచూకీ మాత్రం కనిపెట్టలేక పోయారు.
ఈ పరిస్థితుల్లో రాజవొమ్మంగి, జడ్డంగి, అమీనాబాద్, అమ్మిరేగల అటవీప్రాంతాల్లో బాధిత కుటుంబాల బంధువులు, ఎన్ఏడీ అధికారులు వెతికారు. తక్కువ ఎత్తులో యుద్ధ విమానం వెళ్లినట్లు చెపుతున్నారు. ఐఎన్ఎస్ డేగ నుంచి రోజువారీ శిక్షణలో భాగంగా హాక్ విమానాలు ప్రయాణించాయని అధికారులు నిర్ధారించారు.