Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో అత్యాచారానికి గురైన మీర్జాపూర్ యువతి మృతి

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (08:26 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో వైద్యుల చేతిలో సామూహిక అత్యాచారానికిగురైన బాధిత మీర్జాపూర్ యువతి చికిత్స పొందుతూ మరణించారు. ప్రయాగరాజ్ నగరంలోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రి వైద్యులు తనపై అత్యాచారం చేశారని బాధిత యువతి ఆరోపించారు. 
 
మే 29వ తేదీన తాను పేగు సమస్యతో ఎస్ఆర్ఎన్ ఆసుపత్రిలో చేరితే శస్త్రచికిత్స చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లి తనపై వైద్యులు లైంగికదాడికి తెగబడ్డారని తన సోదరుడికి చెప్పింది. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైద్యులు మంచివారు కాదని, తప్పు చేశారని, తనకు చికిత్స కూడా చేయలేదని బాధితురాలు కాగితంపై రాశారు. దీంతో స్థానిక పోలీసులు వచ్చి దర్యాప్తు చేశారు. 
 
అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని చెప్పి వెళ్లాక యువతి మరణించింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎస్ఆర్ఎన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 
 
యువతికి ఆపరేషన్ చేసిన సమయంలో ఇద్దరు మగ వైద్యులున్నారని, నలుగురు మహిళా సర్జన్లు, నర్సు ఉన్నారని అత్యాచారం జరిగిందనే విషయాన్ని ఎస్పీ సింగ్ కొట్టిపారేశారు. యువతి మానసికస్థితి బాగాలేకనే వైద్యులపై ఆరోపణలు చేసిందని పోలీసులంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments