Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ : నీటి కోసం వచ్చిన బాలికను బాణాలతో కొట్టి చంపేశారు!

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (13:12 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలికను దారుణంగా హత్య చేశారు. నీటి కోసం వచ్చినందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్‌ జిల్లా, ఛోటా భవాటా గ్రామంలో సుర్మదా అనే 13 యేళ్ళ బాలిక తన సోదరుడితో కలిసి నీళ్లు పట్టుకునేందుకు ఓ చేతి పంపు వద్దకు వచ్చింది. అయితే ఆ చేతి పంపు యజమానులమంటూ ఇంద్రసింగ్ భిలాలా‌, అతడి కొడుకు మెస్టా గొడవ చేశారు. 
 
ఈ గొడవ మరింత పెరగడంతో తండ్రీ కొడుకులు కలిసి బాణాలు సంధించగా.. బాలిక ఎడమ కంట్లో నుంచి బాణం చొచ్చుకుపోయి ఆమె అక్కడికక్కడే మరణించింది. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments