Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం : చెత్త ఏరుకునే బాలికపై గ్యాంగ్ రేప్... ఆ తర్వాత...

దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాల కేంద్రంగా మారిపోతోంది. ఇక్కడ మహిళల మానప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదని పలు స్వచ్చంధ సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (10:37 IST)
దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాల కేంద్రంగా మారిపోతోంది. ఇక్కడ మహిళల మానప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదని పలు స్వచ్చంధ సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ తర్వాత గర్భందాల్చిన ఆ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణానికి ఇద్దరు కామాంధులు పాల్పడ్డారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ నగరంలోని మయూర్ విహార్ వీధిలో ఫుట్‌పాత్‌పై చెత్త ఏరుకొని జీవనం సాగిస్తున్న 16 ఏళ్ల ఓ బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని చెప్పి కాన్పు చేశారు. ఆ బాలిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 
 
పోలీసులు బాలికను ప్రశ్నించగా కొన్నాళ్ల క్రితం తనపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారని చెప్పింది. దీంతో అత్యాచారం చేసిన యువకుల కోసం పోలీసులు గాలింపు ఆరంభించారు. బాధితురాలైన బాలికకు కౌన్సెలింగ్ చేసి, ఆమెకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించేందుకు యత్నిస్తున్నామని డీసీసీ ఓంవీర్ సింగ్ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం