Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం.. హత్య.. ఇసుకతో..?

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (22:49 IST)
వయోభేదం లేకుండా మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్‌లోని బంకాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య చోటుచేసుకుంది. బాలిక మృతదేహాన్ని పోలీసులు ఓ గుహలాంటి ప్రదేశంలో ఇసుకతో కప్పి వుండగా వెలికి తీశారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. హోలీ పండగ రోజున తన స్నేహితులతో ఆడుకుంటున్న చిన్నారి  కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. దీనిపై పోలీసులకు కూడా సమాచారం అందించారు. 
 
చిన్నారితో ఆడుకుంటున్న మరో బాలిక ఇచ్చిన సమాచారం ప్రకారం... చిన్నారిని ఓ ఎరుపు రంగు ఈ-రిక్షాలో తీసుకెళ్లినట్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు రిక్షా డ్రైవర్ కోసం వెతకడం ప్రారంభించారు. చివరకు డ్రైవర్​ సాగర్​ సోనీని కనుగొన్నారు.
 
ఈ ఘటనతో తనకు ఎటువంటి ప్రమేయం లేదని రిక్షా డ్రైవర్​ తెలిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారిని విచారించగా చిన్నారిపై అత్యాచారం హత్య జరిగినట్లు తేలింది. 
 
ఈ విషయం తెలుసుకున్న రిక్షా డ్రైవర్ పరారీలో ఉన్నాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments