Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం చేసి.. ప్రైవేట్ భాగాలు కోసేసిన కామాంధులు

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (17:20 IST)
బీహార్ రాష్ట్రంలో అమానవీయ ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కొందరు కామాంధులు ఆ తర్వాత ఆ బాలిక ప్రైవేట్ భాగాలు, నాలుకను కోసేశారు. ప్రస్తుతం ఈ బాలిక పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ దారుణం ఈ నెల 11వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
బీహార్ రాష్ట్రంలోని కళ్యాణ్‌పూర్‌కు చెందిన ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ బాలికను కొందరు దుండగులు పక్కనే ఉన్న ఓ తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత ఆ బాలిక ప్రైవేటు భాగాలతో పాటు నాలుకను విచక్షణారహితంగా కోసివేసి, అక్కడ నుంచి పారిపోయారు. 
 
ఆ బాలికకు రక్తస్రావం కావడంతో అపస్మారకస్థితిలోకి జారుకుంది. అయితే, ఆ బాలికను గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీపీఐ ఎంఎల్ నేతలు బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను పోలీసులు తక్షణం అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం