Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం చేసి.. ప్రైవేట్ భాగాలు కోసేసిన కామాంధులు

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (17:20 IST)
బీహార్ రాష్ట్రంలో అమానవీయ ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కొందరు కామాంధులు ఆ తర్వాత ఆ బాలిక ప్రైవేట్ భాగాలు, నాలుకను కోసేశారు. ప్రస్తుతం ఈ బాలిక పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ దారుణం ఈ నెల 11వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
బీహార్ రాష్ట్రంలోని కళ్యాణ్‌పూర్‌కు చెందిన ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ బాలికను కొందరు దుండగులు పక్కనే ఉన్న ఓ తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత ఆ బాలిక ప్రైవేటు భాగాలతో పాటు నాలుకను విచక్షణారహితంగా కోసివేసి, అక్కడ నుంచి పారిపోయారు. 
 
ఆ బాలికకు రక్తస్రావం కావడంతో అపస్మారకస్థితిలోకి జారుకుంది. అయితే, ఆ బాలికను గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీపీఐ ఎంఎల్ నేతలు బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను పోలీసులు తక్షణం అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

Niharika: యంగ్ స్టర్స్ తో టైం స్పెండ్ చేస్తుంటా అందుకే హెల్ప్ అవుతుంది : అల్లు అరవింద్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం