ఒకటో తరగతిలో చేర్చాలంటే ఆరేళ్లు నిండివుండాలి .. కేంద్రం

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (08:27 IST)
దేశంలో కొత్త జాతీయ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం దృష్టిసారించింది. ఇందులోభాగంగా, ఇక నుంచి ఒకటో తరగతిలో చేర్చాలంటే చిన్నారులకు ఆరేళ్లు నిండివుండాలన్న నిబంధన విధించింది. ఆరేళ్ల లోపు పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించరాదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.
 
జాతీయ విద్యా విధానం ప్రకారం 3 నుంచి 8వ వయసులో పిల్లకు ఫౌండేషన్‌లో దశలో భాగంగా, మూడేళ్లపాటు ప్రీ స్కూల్ విద్య, ఆ తర్వాత 1,2 తరగతులు ఉంటాయి. ప్రీస్కూలు నుంచి పిల్లలకు ఎలాంటి అవాంతరాలులేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించనున్నారు. ఇది జాతీయ నూతన విద్యా విధానం ముఖ్యోద్దేశాల్లో ఒకటి. ఇందులోభాగంగా ఆరేళ్లు నిండిన చిన్నారులకు మాత్రమే ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించాలని సూచన చేసింది.
 
ఇందుకు అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రవేశ ప్రక్రియలో నిబంధనలు సవరించాలని కోరింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిదిలో ప్రీ స్కూల్ విద్యార్థులకు తగిన విధంగా బోధించే టీచర్లను తయారు చేసేందుకు వీలుగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సులను రూపొందించి అమలు చేయాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments