Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం..

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:23 IST)
కరోనాతో జనాలు ప్రాణాలు కోల్పోతున్నా.. కామాంధులు మాత్రం మారట్లేదు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతూనే వున్నారు. తాజాగా చెన్నైకి చెందిన ప్రభుత్వాస్పత్రి సమీపంలో మతిస్థిమితం లేని యువతిని ఐదురోజుల క్రితం ఆటోలో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ ప్రభుత్వాస్పత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో 15 రోజులుగా మతిస్థిమితం లేని 28 ఏళ్ల యువతి సంచరిస్తోంది. 
 
శనివారం అదే ప్రాంతంలో ఓ హోటల్‌ ముందు రక్తగాయాలతో, చిరిగిపోయిన దుస్తులతో పడి ఉండడాన్ని గమనించిన హోటల్‌ వంట మాస్టర్‌ పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని ఆమెను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. 
 
విచారణలో ఆమెను గత ఐదు రోజులుగా అదే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆటోలో ఎక్కించుకొని శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి తిరిగి ఆ ప్రాంతానికి తీసుకొస్తుండేవారని పోలీసుల విచారణలో తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలుగురి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ సినిమా తల్వార్ లో నటుడిగా పూరి జగన్నాథ్

శబ్ధం హారర్ జానర్ తర్వాత మయసభ, మరకతమణి 2 చేస్తున్నాను : హీరో ఆది పినిశెట్టి

Shiva Rajkumar: క్యాన్సర్‌ నుంచి కోలుకున్న శివన్న.. చెర్రీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటా..

తెలుగులో దినేష్ విజన్ నిర్మించిన విక్కీ కౌశల్ ఛావా విడుదల

భూమిక ముఖ్య పాత్ర‌లో గుణ శేఖర్ యుఫోరియా షూట్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments