Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలసరి రోజుల్లో మహిళలకు సెలవు అక్కర్లేదు : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2023 (10:26 IST)
మహిళలకు నెలసరి రోజుల్లో సెలవు అక్కర్లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఓ మహిళగా తన దృష్టిలో నెలసరి అంటే ఓ సహజ ప్రక్రియ అని, అది వైకల్యం కాదని చెప్పారు. అందువల్ల ఆ రోజున సెలవు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, నెలసరి రోజుల్లో మహిళలకు సెలవులపై రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆమె పై విధంగా సమాధానమిచ్చారు. 
 
'నెలసరి అనేది ఓ సహజ ప్రక్రియ.. అదేమీ వైకల్యం కాదని ఓ మహిళగా నేను చెప్పదలుచుకున్నాను'. మహిళ జీవన ప్రయాణంలో అదొక భాగం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సమానావకాశాలకు మహిళలను దూరం చేసే ప్రతిపాదనలు చేయకూడదు' అని మరో ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.
 
నెలసరి సహజ ప్రక్రియ అని, కొందరు మహిళలకు ఆ సమయంలో శారీరక బాధలు ఉన్నా మందులతో ఉపశమనం పొందవచ్చన్నారు. అయితే, ఈ అంశంపై సమాజం ఇప్పటికీ మౌనంగానే ఉంటోందని, ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాజంలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
 
మహిళా ఉద్యోగులకు నెలసరిలో జీతంతో కూడిన సెలవులు మంజూరు తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదన ఏదైనా ఉందా అని ఎంపీ శశిథరూర్ గతవారం లోక్‌సభలో ప్రశ్నించారు. అయితే, అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్మృతి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments