Webdunia - Bharat's app for daily news and videos

Install App

హల్దీ వేడుక తర్వాత స్నానానికి వెళ్లి శవమైన కనిపించిన వధువు

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (13:51 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. శుభకార్యంలో భాగంగా హల్దీ వేడుక తర్వాత స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లిన వధువు శవమై కనిపించింది. దీంతో ఈ వివాహానికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అహ్మదాబాద్‌కు చెందిన మున్నీదేవి కుమార్తె గీత.. ఈమె ముజఫర్‌ నగర్‌లోని ఓ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంది. ఈమెకు ఈ నెల 7వ తేదీన బులంద్‌షెహర్‌కు చెందిన సుమిత్‌తో వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆదివారం హల్దీ వేడుక సందర్భంగా గీతకు కాళ్ళుచేతులు, ముఖానికి పసుపు పూశారు. ఈ వేడుక తర్వాత ఆమె స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లారు. 
 
ఆ తర్వాత ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపుకొట్టి పిలిచారు. లోపలి నుంచి ఎలాంటి శబ్దం లేదన స్పందన లేకపోవడంతో అనుమానించిన పోలీసులు.. బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా, గీత బాత్రూమ్‌లో అచేతనస్థితిలో కిందపడివుంది. ఆ వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించారు. ఈ రిపోర్టు వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments