Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక సంగీతంపై 'మీ టూ' దరువు ... ఏడుగురు కళాకారులపై నిషేధం

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (10:48 IST)
'మీటూ' ఉద్యమం కర్ణాటక సంగీత కళాకారులకూ పాకింది. ఫలితంగా ఏడుగురు కళాకారులపై నిషేధం విధిస్తూ మ్యూజిక్ అకాడెమీ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రతి యేడాది డిసెంబరు నెలలో చెన్నై నగరంలో ప్రతిష్టాత్మక మార్గశిరమాస సంగీతోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ సంగీతోత్సవాల్లో వేలాది మంది కళాకారులు పాల్గొంటుంటారు. 
 
ఇందులో పాల్గొనే యువ గాయనీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో చిత్రవీణ కళాకారుడు ఎన్‌.రవికిరణ్‌ సహా ఏడుగురు ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారులు పాల్గొనకుండా మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ నిషేధం విధించింది. 'మీ టూ' ఉద్యమం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అకాడమీ అధ్యక్షుడు ఎన్‌.మురళి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
నిషేధం వేటు పడినవారిలో సంగీత కళానిధి బిరుదాంకితుడు చిత్రవీణ రవికిరణ్‌, ప్రముఖ గాత్ర కళాకారుడు ఓఎస్‌ త్యాగరాజన్‌, వయొలిన్‌ విద్వాంసుడు శ్రీరామ్‌, మృదంగ కళాకారులు మన్నార్గుడి ఎ.ఈశ్వరన్‌, శ్రీముష్ణం వి.రాజారావు, ఆర్‌.రమేశ్‌, తిరువారూరు వైద్యనాథన్‌లు ఉన్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం