Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా తగ్గిన కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (14:12 IST)
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు ఎనిమిది నెలల కనిష్ఠానికి తగ్గి.. 12 వేలకు పడిపోయాయి. కరోనా సెకండ్‌వేవ్‌ ప్రారంభ వేళ.. మార్చిలో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత ఏప్రిల్‌, మే నెలలో రికార్డు స్థాయికి చేరిన వైరస్ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోకి వస్తోంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను వెలువరించింది.
 
నిన్న 11,31,826 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,428 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.42 కోట్లకు చేరాయి. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. గత ఏడాది మార్చి తర్వాత అత్యల్పంగా 889 కొత్త కేసులు వెలుగుచూశాయి.

కేరళలో ఆరువేలమందికి పైగా వైరస్ సోకింది. నిన్న 15,951 మంది కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.35 కోట్ల మార్కును దాటింది. రికవరీ రేటు 98.19 శాతానికి చేరగా.. క్రియాశీల కేసుల రేటు 0.48 శాతానికి పడిపోయింది.

ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 1.63 లక్షలుగా ఉంది. ఈ మధ్య కాలంలో కేరళ మృతుల సంఖ్యను సవరిస్తోంది. దాంతో నిన్న 356 మరణాలు నమోదుకాగా.. మొత్తంగా 4,55,068 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
మరోపక్క కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. నిన్న 64,75,733 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 102.94 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments