Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా తగ్గిన కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (14:12 IST)
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు ఎనిమిది నెలల కనిష్ఠానికి తగ్గి.. 12 వేలకు పడిపోయాయి. కరోనా సెకండ్‌వేవ్‌ ప్రారంభ వేళ.. మార్చిలో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత ఏప్రిల్‌, మే నెలలో రికార్డు స్థాయికి చేరిన వైరస్ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోకి వస్తోంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను వెలువరించింది.
 
నిన్న 11,31,826 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,428 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.42 కోట్లకు చేరాయి. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. గత ఏడాది మార్చి తర్వాత అత్యల్పంగా 889 కొత్త కేసులు వెలుగుచూశాయి.

కేరళలో ఆరువేలమందికి పైగా వైరస్ సోకింది. నిన్న 15,951 మంది కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.35 కోట్ల మార్కును దాటింది. రికవరీ రేటు 98.19 శాతానికి చేరగా.. క్రియాశీల కేసుల రేటు 0.48 శాతానికి పడిపోయింది.

ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 1.63 లక్షలుగా ఉంది. ఈ మధ్య కాలంలో కేరళ మృతుల సంఖ్యను సవరిస్తోంది. దాంతో నిన్న 356 మరణాలు నమోదుకాగా.. మొత్తంగా 4,55,068 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
మరోపక్క కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. నిన్న 64,75,733 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 102.94 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments