Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంలో భారీ అగ్నిప్రమాదం ... 150 దుకాణాలు దగ్ధం

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (11:51 IST)
అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో జోర్హాట్ పట్టణంలో ఉన్న చౌక్ బజార్‌లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలువైపులకు వ్యాపించడంతో ఏకంగా 150కి పైగా దుకాణాలు కాలిపోయాయి. 
 
ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతం మొత్తం దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 25 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. విద్యుత్ షార్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం.
 
కాగా, ఈ ప్రమాదం వల్ల భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. అర్థరాత్రి పూట ప్రమాదం జరగడంతో షాపులన్నీ మూసి ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఈ ప్రమాదంలో కాలిపోయిన దుకాణాల్లో ఎక్కువగా వస్త్ర, నిత్యావసర వస్తు దుకాణాలు ఉన్నాయి. కాగా, జోర్హాట్ ప్రాంతంలో గత రెండు నెలల కాలంలో భారీ అగ్నిప్రమాదం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత యేడాది మార్వారీ పట్టీ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో పలు దుకాణాలు దగ్ధమయ్యాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments