Webdunia - Bharat's app for daily news and videos

Install App

యేడాది క్రితం వివాహం.. 3 నెలల క్రితం పుట్టిన కుమార్తెను చూడకుండానే...

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (14:18 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన దాడిలో చనిపోయిన జవాన్ల సంఖ్య 49కు చేరింది. వీరిలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రోహితాష్ లాంబా అనే జవాను కూడా ఉన్నాడు. ఈ జవానుకు సరిగ్గా ఒక యేడాది క్రితం పెళ్లి జరుగగా, మూడు నెలల క్రితం పాప పుట్టింది. ఈ పాపను ఒక్కసారి కూడా లాంబా చూడలేదు. ఈ ఈ నెలాఖరులో ఇంటికి వెళ్ళేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలోనే ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
దీనిపై లాంబా స్నేహితుడు ఒకరు మాట్లాడుతూ, కుమార్తెను చూసేందుకు రోహితాష్ హోలీ పండుగకు రావాల్సివుంది. అయితే ఇంతలోనే అతను ఉగ్రదాడికి బలయ్యాడు. అతని మరణవార్త విన్నాక అతని ఇంటిలోనేకాకుండా గ్రామమంతటా విషాదం నెలకొంది. అతని ఇంట్లో పరిస్థితులన్నీ సవ్యంగా ఉన్న సమయంలో శ్రీనగర్ నుంచి వచ్చిన ఫోను రోహితాష్ ఇంట్లో విషాదాన్ని నింపేసిందన్నారు. సీఆర్‌పీఎఫ్ మేజర్ ఫోనులో ఈ విషయాన్ని రోహితాష్ కుటుంబ సభ్యులకు తెలియజేశారన్నారు. రోహితాష్ మరణవార్త వినగానే అతని సోదరుడు జితేంద్ర కుప్పకూలిపోయాడనీ, ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments