Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టు ఆర్డినెన్స్‌ను కోర్టులో సవాల్ చేయొచ్చు.. కానీ ఆందోళన వద్దు : ఖట్జూ

జల్లికట్టు ఆందోళనకారుల్లో తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై నెలకొన్న భయాందోళనలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ నివృత్తి చేసేపనిలో పడ్డారు. ఇదే అంశంపై ఆయన తన ఫేస్‌బుక్‌లో ఓ

Webdunia
ఆదివారం, 22 జనవరి 2017 (15:06 IST)
జల్లికట్టు ఆందోళనకారుల్లో తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై నెలకొన్న భయాందోళనలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ నివృత్తి చేసేపనిలో పడ్డారు. ఇదే అంశంపై ఆయన తన ఫేస్‌బుక్‌లో ఓ ట్వీట్ చేశారు. 
 
జల్లికట్టును నిర్వహించేందుకు అనుమతినిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ తాత్కాలికమైనదే. అయితే, దీనిపై గవర్నర్ సంతకం చేసి ఆమోదముద్ర వేశారు. అయినా ఈ ఆర్డినెన్స్ తాత్కాలికమైనదనడం నిజమేనని జస్టిస్ కట్జూ చెప్పారు. అయితే తమిళనాడు శాసనసభ సోమవారం సమావేశం కాబోతోందని, ఈ ఆర్డినెన్స్ స్థానంలో చట్టాన్ని ఆమోదిస్తుందని, అది శాశ్వతమైనదవుతుందని తెలిపారు. 
 
ఈ విధంగా చేసిన చట్టంపై కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని, అయితే ఇది విజయవంతం కాకపోవచ్చునని తెలిపారు. దీనికి కారణం రాజ్యాంగంలోని అధికరణ 254(2) ప్రకారం రాష్ట్రపతి ఆమోదం లభించడమేనని పేర్కొన్నారు. అందువల్ల జల్లికట్టు మద్దతుదార్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments