మాజీ కేంద్ర మంత్రి, డీఎంకే పార్టీ నేత దయానిధి మారన్, పారిశ్రామిక వేత్త కళానిధి మారన్లకు కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే సీబీఐ కోర్టు సమన్లు అందుకున్న వారికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నుంచి కూడా సమన్లు వచ్చాయి.
వారిని ఎయిర్ సెల్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఇడి ఆదేశించింది. ఈ కేసులో మారన్ సోదరులకు చెందిన ఆరువందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇడి జప్తు చేసే అవకాశం ఉందని సమాచారం.