కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

ఠాగూర్
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (19:06 IST)
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరుగనున్నాయి. గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. వృద్ధాప్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. మన్మోహన్ ఇకలేరన్న వార్త యావత్ భారతావనిని విషాదంలో ముంచెత్తింది. ప్రస్తుతం మన్మోహన్ భౌతికకాయం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉంది. ఆయనకు పూర్తిస్థాయి ప్రభుత్వ లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించనుంది. ఆయన పార్థివదేహంపై జాతీయ పతకాన్ని కప్పి వుంచారు. 
 
కాగా, మన్మోహన్ సింగ్ కుమార్తెల్లో ఒకరు అమెరికాలో ఉంటున్నారు. ఆమె భారత్‌కు రావాల్సివుంది. ఆమె శనివారం ఉదయానికి ఢిల్లీకి చేరుకోవచ్చని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ వెల్లడించారు. ఆ తర్వాతే ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 
 
ఇక ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి శనివారం ఉదయం తరలించనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచి ఆ తర్వాత అక్కడ నుంచి ఊరేగింపుగా రాజ్‌ఘాట్‌కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments