Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణకాష్టంలా మారిన మణిపూర్ - మహిళా మంత్రి ఇంటికి నిప్పు

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (12:53 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఆ రాష్ట్రం ఇపుడు రావణకాష్టంలా మారింది. దీంతో ఆందోళనకారులు ఓ మహిళా మంత్రి ఇంటికి నిప్పు అంటించారు. అదేసమయంలో ఈ ఘర్షణలను అణిచివేసేందుకు సాయుధ బలగాలు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. రాష్ట్రానికి చెందిన ఏకైక మహిళా మంత్రి ఇంటికి నిప్పు అంటించడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
రాష్ట్ర రాజధాని ఇంఫాల్ వెస్ట్ జిల్లా లాంఫెల్ ప్రాంతంలో ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి నెమ్చా కిప్గెన్ బంగళాను లక్ష్యంగా చేసుకుని దండుగులు బుధవారం సాయంత్రం నిప్పు పెట్టారు. ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేకపోవడంతో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ సీనియర్ అధికారుల నేతృత్వంలోని భద్రతా బలగాలు హుటాహుటిన మంత్రి నివాసానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఇంటికి నిప్పు పెట్టిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వంలోని 12 మంది మంత్రుల్లో కిప్గెన్ ఏకైక మహిళా మంత్రి. ప్రత్యేక పరిపాలనను డిమాండ్ చేస్తున్న 10 మంది కుకీ ఎమ్మెల్యేలలో కిప్గెన్ ఒకరు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments